ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు…
కర్నూల్ ఆర్డిఓ సందీప్ కుమార్

వెల్దుర్తి అక్టోబర్ 18 (అఖండ భూమి) : ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకే అని కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పుల్లగుమ్మి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. అక్కడ రెవెన్యూ సదస్సులను రైతులు ఉపయోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం నందు పర్యవేక్షించి. రికార్డులను పరిశీలించారు. స్థానిక తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మతో మాట్లాడుతూ.. రీసర్వే జరిగిన గ్రామాలలో రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. రైతుల సమస్యలను 86 రోజుల లోపల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ సర్వే నిర్వహించిన గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించి రైతుల పాస్ బుక్కులలో ఉన్నటువంటి లోటుపాటులను సవరించేందుకే రెవెన్యూ సదస్సులను నిర్వహించామని తెలిపారు. పాస్ బుక్ ల మీద ఉన్నటువంటి బొమ్మలను తొలగించి, ఎల్పిజి నంబర్లను అటాచ్మెంట్ చేసి ఈ రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా గత ప్రభుత్వం చేసినందువల్లే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని సవరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్డిఓ వెంట వెల్దుర్తి తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


