పిఠాపురం నియోజకవర్గం జగపతి రాజ పురం గ్రామంలో డ్రెయిన్ లో పలుచోట్ల పూడిక పేరుకుపోయింది. చాలా కాలంగా పూడిక పేరుకుపోయి, మురుగునీరు సరిగ్గా దిగక, అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా, దుర్వాసన వెదజల్లుతుంది.దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అంతే కాకుండా నిల్వ నీటి పై దోమలు, వృద్ధి చెందడం తో అనేక మంది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటి అనేక వ్యాధుల బారిన పడ్డారు. గ్రామస్తులు విషయాన్ని ఆ గ్రామం లోని వార్డు మెంబర్ మడికి బాబ్జి దృష్టికి తీసుకెళ్లడం తో గ్రామ ప్రజల ఇబ్బందిని గుర్తించి తానే స్వయంగా డ్రైనేజీలో పేరుకు పోయిన పూడికను తొలగించి శుభ్రపరచారు.దీనితో సమస్య పరిష్కారమయింది. ఎప్పటినుండో ఉన్న సమస్య పరిష్కారం కావడం పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


