పిఠాపురం నియోజకవర్గం జగపతి రాజ పురం గ్రామంలో డ్రెయిన్ లో పలుచోట్ల పూడిక పేరుకుపోయింది. చాలా కాలంగా పూడిక పేరుకుపోయి, మురుగునీరు సరిగ్గా దిగక, అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా, దుర్వాసన వెదజల్లుతుంది.దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అంతే కాకుండా నిల్వ నీటి పై దోమలు, వృద్ధి చెందడం తో అనేక మంది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటి అనేక వ్యాధుల బారిన పడ్డారు. గ్రామస్తులు విషయాన్ని ఆ గ్రామం లోని వార్డు మెంబర్ మడికి బాబ్జి దృష్టికి తీసుకెళ్లడం తో గ్రామ ప్రజల ఇబ్బందిని గుర్తించి తానే స్వయంగా డ్రైనేజీలో పేరుకు పోయిన పూడికను తొలగించి శుభ్రపరచారు.దీనితో సమస్య పరిష్కారమయింది. ఎప్పటినుండో ఉన్న సమస్య పరిష్కారం కావడం పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..