ఆత్రేయపురంలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్
ఆత్రేయపురం మండలం వ్యాలీ, రాజవరం గ్రామాలలో రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్ పర్యటించారు. ఆయన అనేక రోజులుగా ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేఖంగా పోరాడుతూ అనేక గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ అలుపెరుగక నిరంతర కృషి తో కొనసాగుతున్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ మాలలపై జరిగే అన్యాయాలను, ఎస్సీల కుట్రపూరిత వర్గీకరణల వలన జరిగే నష్టాలను గూర్చి ఆ గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ చైతన్య పరిచారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలు జాతులు మధ్య చిచ్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. మరోసారి మాలల జోలికి రాకుండా ఉండాలంటే మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీనైనా భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, దళిత నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..