
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నందు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి టిడిపి కార్యాలయం నందు 50 కేజీల కేక్ తో మండలంలోని టిడిపి కార్యకర్తలు టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పాలు పండ్లు బెడ్లు పంపిణీ చేశారు. అనంతరం బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు 48 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపామన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు ఎంతో సేవలందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షులు టి. బలరాం గౌడ్, మాస పోగు బజారు, సుధాకర్ గౌడ్, పుల్లగుమ్మి నాగేశ్వర్ రెడ్డి, గుంటిపల్లె వెంకటరాముడు, రామళ్లకోట రామకృష్ణ ఆచారి, అల్లు గుండు బాలమది, రాఘవేంద్ర, బాలరాజు, మోష, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


