ఎస్సీల కుల గణన లిస్ట్ లో అన్నీ తప్పులే – అభ్యంతరం తెలియజేసిన ఎస్సీ నాయకులు
కోటనందూరు మండలం (అఖండ భూమి) డిసెంబర్ 31
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సి కుల గణన (సామాజిక, ఆర్థిక, విద్య) పై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేపట్టిన సర్వే డేటా లో అనేక తప్పుడు సమాచారం ఉందని మండల ఎస్సీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డేటా సర్వే నుంచి సేకరించింది కాదని అలా సేకరిస్తే అన్ని తప్పులు వచ్చేవి కాదని ఆమోదయోగ్యంగా లేదని వాపోయారు. దీనిపై ఎస్సీ నాయకులు కోటనందూరు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. జాబితాలలో కులాలతోపాటు సామాజిక, ఆర్థిక, విద్య అంశాలలో వందలాది తప్పులు ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా చాలామంది పేర్లు వారి సమాచారం లేదన్నారు. దీనిపై కోటనందూరు మండల తహసీల్దార్ స్పందిస్తూ పోర్టల్ లో కులాల మార్పుకు సంబంధించి ఆప్షన్ మాత్రమే ఉందని మిగిలిన వాటి ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.దీనిపై ఎస్సీ నాయకులు స్పందిస్తూ గ్రామాలలో తిరిగి కులగణన సర్వే నిస్పక్షపాతంగా చేపట్టాలని ఇలా తప్పుడు సమాచారంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి కచ్చితంగా గ్రామాలలో రీసర్వే చేపట్టాలని తహసీల్దార్ ను కోరారు. కాగా తుది జాబితాను జనవరి 10న ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



