వృద్ధాశ్రమంలో ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సురా స్రవంతి జన్మదిన వేడుకలు 
అఖండ భూమి వెబ్ న్యూస్ :
హనుమకొండలో గల సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో శనివారం రోజున సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి పుట్టినరోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో నివసిస్తున్న 78 మంది అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిదిగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా సూర స్రవంతి కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహాకులు మహమ్మద్ చోటు, లక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెట్టిపల్లి దేవిక, వరంగల్ జిల్లా కన్వీనర్ కోడి విజయలత,బండారి రాజు,సౌరం అభిలాష్, కల్పన,సురేష్ పాల్గొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


