కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ కి ఘన్ నివాళి

బాన్సువాడ డివిజన్ ప్రతినిధి.జనవరి 30
అఖండ భూమి వెబ్ న్యూస్ :
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధి వర్ధంతి సందర్భంగా అయిన విగ్రహానికి పూలదండలు వేసి నివాలులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం లో మహాత్మ గాంధి చేసిన పోరాటం మరువలేనిదని శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగించి ప్రజలను ఐక్యం చేయడం లో గాంధీజీ ఎంతో కృషి చేశారని అన్నారు.దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,చంద్రశేఖర్ అజాద్ లాంటి ఎందరో వీరులు ప్రాణ త్యాగాలు చేసినారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు హన్మంతు యాదవ్,సీనియర్ నాయకులు చౌలావార్ హన్మండ్లు స్వామి,రామ్ పటేల్,సంతోష్ మేస్త్రి,రాజు తైదాల్వార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూర్వార్ అశోక్,కుషాల్ రచ్చవార్,దిగంబర,బండివార్ హన్మండ్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


