అంబరాన్నంటిన బిజెపి సంబరాలు..
-ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బిజెపి ఘనవిజయం..
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు శనివారం గాంధీ చౌక్ లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత కేజ్రీవాల్ పై రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్ ఆప్ పార్టీనీ ప్రజలు తిరస్కరించి. మోడీ చేస్తున్న అభివృద్ధినీ చూసి బిజెపి పార్టీకి పట్టం కట్టారని. దేశంలో మోదిహవ కొనసాగుతుందని. మోదీ హవాలో ఏ పార్టీ అయినా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరిస్తారని. సంస్థ గత ఎన్నికల్లో బిజెపి పార్టీది అంతిమ విజయమని వారు అభివర్ణించారు. ఈ వేడుకల్లో సొసైటీ డైరెక్టర్ షక్కర్ల బాలకిషన్. కంచి నవార్ యాదవ రావు. షక్కర్ల వార్ నరేష్. గోపాన్ వార్ శివాజీ. కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



