పీసా చట్టంపై కమిటీ సభ్యులు అవగాహన కలిగి ఉండాలి
ఎంపీడీవో “ఎస్ కె వి ప్రసాద్,” జడ్పిటిసి “వార నూకరాజు”
కొయ్యూరు అల్లూరి జిల్లా (అఖండ భూమి) ఫిబ్రవరి 15
పీసా చట్టాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ తెలియజేశారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో పిసా సభ్యులకు ప్రజాప్రతినిధులకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్ జెడ్పిటిసి వార నూకరాజు మాట్లాడుతూ పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధికి సమిష్టి సహకారం ఉంటేనే గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యం అవుతుందని దీనికోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పీసా కమిటీ ఇది విధానాలపై స్పష్టంగా వివరించారు. ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చూసించారు అలాగే ఈ శిక్షణ తరగతులకు2 27 హాజరు కావలసి ఉండగా 215 మంది హాజరయ్యారని తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


