డాక్టర్ చల్లాను ఘనంగా సన్మానించిన రజక సంఘం వారు.
ఆలమూరు ఫిబ్రవరి 16 (అఖండ భూమి న్యూస్):మండల కేంద్రం ఆలమూరులో జరిగిన రజకుల బల్లల పండుగ సందర్భంగా సత్తెమ్మ తల్లి సంబరం ఆదివారం ఎంతో ఘనంగా జరిగినది.గతంలో స్థానికంగా నివాసం ఉండె రజకులు బతుకుతెరువు కోసం హైదరాబాదు వలస వెళ్ళి అక్కడే ఉంటున్నారు.సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే సత్తెమ్మ తల్లి సంబరం సందర్భంగా వారంతా విచ్చేసి అందరు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.రజక సంఘం ఆహ్వానం మేరకు సత్తెమ్మ తల్లి సంబరానికి విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు పై పూలవర్షం కురుపించి ఆయనను ఘనంగా సన్మానించిన రజకుల ఉత్సవకమిటీ వారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతు రజకుల బల్లల పండుగ సందర్భంగా అందర్ని కలవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దువ్వాపు సుబ్బారావు,ఎరుకొండ ముసలయ్య,ఎరుకొండ గణేష్,టేకి గంగరాజు,ఇల్లూరి శ్రీను,ఎరుకొండ సత్తిబాబు,ఎరుకొండ మణి,ఎరుకొండ ఉమామహేశ్వరరావు,నందమూరి ప్రసాద్,ఎరుకొండ సత్తిబాబు,తులసి నాగార్డున తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



