శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు నకిలీ వెబ్సైట్లు నమ్మి మోసపోవద్దు
16, మార్చి,( అఖండ) భూమి న్యూస్
శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు మరియు ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది.
వసతిని ఆన్లైన్లో రిజర్వు చేసుకునేందుకు మరియు అన్ని ఆర్జితసేవా టికెట్లు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం, అతిశీఘ్రుదర్శనం మొదలైన అన్నిటికెట్లను ఆన్లైన్లో పొందేందుకు భక్తులు దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.realladevasthanam.org లేదా దేవదాయశాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in లను మాత్రమే వినియోగించుకోవలసినదిగా కోరుతున్నాము.
దేవస్థాన మరియు దేవదాయశాఖ వెబ్ సైట్ కాకుండా భక్తులు ఇతర నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని తెలియజేస్తున్నాం.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339.01301 / 52 /53/లను సంప్రదించవచ్చును. అని శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి తెలిపారు
You may also like
-
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్లు మృతి..!
-
శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు.
-
ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
-
గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు
-
తరువాత కలిగిన నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి..!