మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్ఐ చౌడయ్య
ఐదేళ్ల తర్వాత కుటుంబంతో కలిసిన వ్యక్తి
అఖండ భూమి -యర్రగొండపాలెం
యర్రగొండపాలెం పోలీసులు మరోసారి తమ దర్యాప్తు నైపుణ్యాన్ని చాటారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన నమోదైన మిస్సింగ్ కేసును ఐదేళ్ల అనంతరం విజయ వంతంగా ఛేదించారు. తప్పిపోయిన శ్రీరాము లును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఎస్ఐ పి చౌడయ్య ఆదివారం వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తి కుంజు శ్రీరాములు(55), బోయ కులానికి చెందిన వ్యక్తి. యర్రగొండపాలెం నివాసి. అతను 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన కనిపించకపో వడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ చౌడయ్య నేతృత్వంలోని బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలను సేకరించి చివరికి ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి కుటుంబానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ చౌడయ్య మాట్లాడుతూ ఎవరయినా తప్పిపోయిన విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



