మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్ఐ చౌడయ్య
ఐదేళ్ల తర్వాత కుటుంబంతో కలిసిన వ్యక్తి
అఖండ భూమి -యర్రగొండపాలెం
యర్రగొండపాలెం పోలీసులు మరోసారి తమ దర్యాప్తు నైపుణ్యాన్ని చాటారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన నమోదైన మిస్సింగ్ కేసును ఐదేళ్ల అనంతరం విజయ వంతంగా ఛేదించారు. తప్పిపోయిన శ్రీరాము లును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఎస్ఐ పి చౌడయ్య ఆదివారం వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తి కుంజు శ్రీరాములు(55), బోయ కులానికి చెందిన వ్యక్తి. యర్రగొండపాలెం నివాసి. అతను 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన కనిపించకపో వడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ చౌడయ్య నేతృత్వంలోని బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలను సేకరించి చివరికి ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి కుటుంబానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ చౌడయ్య మాట్లాడుతూ ఎవరయినా తప్పిపోయిన విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం