మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్ఐ చౌడయ్య
ఐదేళ్ల తర్వాత కుటుంబంతో కలిసిన వ్యక్తి
అఖండ భూమి -యర్రగొండపాలెం
యర్రగొండపాలెం పోలీసులు మరోసారి తమ దర్యాప్తు నైపుణ్యాన్ని చాటారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన నమోదైన మిస్సింగ్ కేసును ఐదేళ్ల అనంతరం విజయ వంతంగా ఛేదించారు. తప్పిపోయిన శ్రీరాము లును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఎస్ఐ పి చౌడయ్య ఆదివారం వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తి కుంజు శ్రీరాములు(55), బోయ కులానికి చెందిన వ్యక్తి. యర్రగొండపాలెం నివాసి. అతను 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన కనిపించకపో వడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ చౌడయ్య నేతృత్వంలోని బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలను సేకరించి చివరికి ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి కుటుంబానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ చౌడయ్య మాట్లాడుతూ ఎవరయినా తప్పిపోయిన విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



