మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
అఖండ భూమి -యర్రగొండపాలెం:
టిడిపి సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని ఆయన స్వగృహంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ జిలాని, వడ్లమూడి లింగయ్య, పోతిరెడ్డి రమణారెడ్డి, ఊట్ల సీతారామయ్య, వెన్నా వెంకటరెడ్డి, సత్తార్, ఇస్మాయిల్, మేకల బాదరయ్య, వేగినాటి ఆత్మ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



