మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

 

 

మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

అఖండ భూమి -యర్రగొండపాలెం:

టిడిపి సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని ఆయన స్వగృహంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ జిలాని, వడ్లమూడి లింగయ్య, పోతిరెడ్డి రమణారెడ్డి, ఊట్ల సీతారామయ్య, వెన్నా వెంకటరెడ్డి, సత్తార్, ఇస్మాయిల్, మేకల బాదరయ్య, వేగినాటి ఆత్మ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!