వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 28 (అఖండ భూమి న్యూస్);
వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ స్థాయి పురస్కారాన్ని గోదావరిఖని లో కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో 200 ల మంది బాధపడుతున్నారని వారు చికిత్స నిమిత్తమై హైదరాబాద్,నిజామాబాద్ కు వెళ్లడం జరుగుతుందని వారి ప్రాణాలను కాపాడాలంటే 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం అని,వారి ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరాలులను ఏర్పాటు చేసి 2500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని,ఈ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సురభి శ్రీధర్,సహకరిస్తున్న రక్తదాతలకు,మీడియా ప్రతినిధులకు,కృతజ్ఞతలు తెలియజేశారు
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


