వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు.

 

 

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 28 (అఖండ భూమి న్యూస్);

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ స్థాయి పురస్కారాన్ని గోదావరిఖని లో కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అందుకోవడం జరిగింది.

 

ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో 200 ల మంది బాధపడుతున్నారని వారు చికిత్స నిమిత్తమై హైదరాబాద్,నిజామాబాద్ కు వెళ్లడం జరుగుతుందని వారి ప్రాణాలను కాపాడాలంటే 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం అని,వారి ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరాలులను ఏర్పాటు చేసి 2500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని,ఈ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సురభి శ్రీధర్,సహకరిస్తున్న రక్తదాతలకు,మీడియా ప్రతినిధులకు,కృతజ్ఞతలు తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!