భూభారతి చట్టంపై వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరించాలి.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 30 (అఖండ భూమి న్యూస్);
భూ భారతి చట్టం పై పైలెట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ మండలంలో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం లింగంపేట్ ఎంపీడీఓ కార్యాలయంలో రెవిన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17 నుండి 30 వరకు లింగంపేట్ మండలంలోని 23 రెవిన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టవలసి ఉంటుందని తెలిపారు. సుమారు 3700 దరఖాస్తులు రావడం జరిగిందని, అట్టి దరఖాస్తులను పరిశీలించి చట్ట. ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు 9 టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అట్టి టీమ్ లలో తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, సర్వేయర్స్ లను నియమిస్తామని తెలిపారు. ప్రతీ టీమ్ కు సుమారు 400 దరఖాస్తులు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఆయ సిబ్బంది విధులు నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. టీమ్ లకు కావసిన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ కు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ప్రభాకర్, లింగంపేట్ తహసీల్దార్ సురేష్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


