పది ఫలితాల్లో నలంద టాప్ -100% ఉత్తీర్ణత..
-టాపర్ గా 575 స్వేజన్ రెడ్డి..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఏప్రిల్: 30 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో గల నలంద హై స్కూల్ లో బుధవారం పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించగా జక్రాన్ పల్లి మండలం కలిగోట గ్రామానికి చెందిన ఎన్ స్వేజన్ 575/600 సాధించి టాపర్గా నిలిచాడు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన విద్యార్థులు భావన రెడ్డి 564.. సంకీర్తన 555.. మామిడిపల్లి కి చెందిన హలీమా 554.. సికింద్రాపూర్ కు చెందిన రక్షిత 546.. భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ 542 మార్కులు సాధించి నలంద హై స్కూల్ టాపర్లుగా నిలిచారు. 23 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని నలంద స్కూల్ యాజమాన్యం ప్రసాద్ తెలిపారు.2024-25 అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు ప్రతిభను చాటడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ స్కూల్స్ లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యాసంస్థగా నిలవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు శాలువా. పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


