వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలి…

 

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలి…

జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ వి. విక్టర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 10 (అఖండ భూమి న్యూస్);

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని, తూకం సరిగా వేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కోమటిపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, టార్పాలిన్, తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు.

*భూ భారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి ..అదనపు కలెక్టర్*…

భూ భారతి సర్వే కు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. లింగంపేట్ మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో డెస్క్ వర్క్ లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!