ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసింది..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 18 (అఖండ భూమి న్యూస్);
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నాము అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
ఆదివారం చార్మినార్ ప్రాంతంలోని మృతులు, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అని అన్నారు.