నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్
కామారెడ్డి మే 18,( తెలంగాణ పత్రిక జిల్లా ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలోని వనదుర్గ పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో కామారెడ్డి కి చెందిన రాజ్ కుమార్- మానస వివాహం వైభావంగా జరిగింది. ఈ వివాహ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థల చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి, దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ లు హాజరయ్యారు.నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పిఏ గంగాధర్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె రామస్వామి గౌడ్, ఐరన్ సందీప్ కామరెడ్డి కౌన్సిలర్ లక్ష్మీనారాయణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు తాటిపల్లి శ్రీకాంత్, నల్లపు శ్రీనివాస్ ఆడెపు శంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్, సంతోష రెడ్డి, షమ్మీ నయీమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.