కారుణ్య నియామకాల్లో భాగంగా ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు అందజేత…
*• కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలలోపే ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు అందజేసిన జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అఖండ భూమి న్యూస్);
కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలల క్రితం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వడ్ల రవి భార్య సౌఖ్యకు, అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానసకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పి యం, రాజేష్ చంద్ర ఐపిఎస్ సోమవారం అందజేశారు.
విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు విడతలవారీగా కారుణ్య నియామకాలలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఉద్యోగాల్లో నియామితులైన సౌఖ్య, మానసలకు అభినందనలు తెలుపుతూ, నిజాయితీగా విధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే. నరసింహారెడ్డి ఏఓ యండి. అప్సర్ , సూపరింటెండెంట్లు గంగాధర్, జామీల్అలీ తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల లోపే ఉద్యోగం ఇచ్చినందుకు జిల్లా పోలీస్ సిబ్బంది ఎస్పీ కీ కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



