కే.శే” కొండు అంజిబాబు జన్మదిన సందర్బంగా భోజనం పంపిణి

 

కే.శే” కొండు అంజిబాబు జన్మదిన సందర్బంగా భోజనం పంపిణి

బెల్లంపల్లి మే24(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కి.శే”కొండు అంజిబాబు జన్మదినం సందర్బంగా శనివారం బెల్లంపల్లి పట్టణంలో అంజిబాబు భార్య శ్రావణి, అక్క కృష్ణవేణి లు కలసి కాల్ టెక్స్,రైల్వే స్టేషన్,బజార్ ఏరియాలోని నిరుపేదలకు భోజన ఫ్యాకెట్లు పంపిణి చేసారు.

ఈసందర్బంగా అక్క కృష్ణవేణి మాట్లాడుతూ..అంజిబాబు చనిపోయి 4సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మా హృదయంలో చిరస్థాయిగా జీవించే ఉన్నాడన్నారు.అయన భౌతికంగా మా మధ్య లేకపోయినా అయన జ్ఞాపకాలు ఎప్పుడు మావెంటే వుంటాయన్నారు.

తమ్ముడు అంజిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం మే 24న అంజిబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు…

Akhand Bhoomi News

error: Content is protected !!