పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…

పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణం ఆరో వార్డు పరిధిలోని పాత రాజంపేటలో పోచమ్మ బోనాల పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు బోనాల కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఆలయంలో అర్చన, హారతి, వేద మంత్రముల మంత్రోచ్ఛారాణా ల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ పిలుపుమేరకు హాజరైన ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాత రాజంపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!