మానవ సేవయే మాధవ సేవ

మానవ సేవయే మాధవ సేవ

మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి

మానవత్వాన్ని చాటుకున్న స్ఫూర్తి సేవకులు

స్ఫూర్తి సేవా సమితి. డోన్/నంద్యాల జిల్లా

అఖండ భూమి వెబ్ న్యూస్ :-

నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ అనే అభాగ్యుడు అనారోగ్యంతో చనిపోగా ఆర్టీసీ సిబ్బంది స్ఫూర్తి టీమ్ కి సమాచారం ఇవ్వగా స్ఫూర్తి టీమ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించగా అతడిది శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత డోన్ పట్టణ పోలీస్ వారికి సమాచారం అందించి మృత దేహాన్ని వారికి అప్పగించడం జరిగింది. అనంతరం మృతదేహన్ని సొంత ఊరికి అంబులెన్సులో తరలించారు. స్ఫూర్తి సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి మధు, మోహన్ రెడ్డి, బొందిమడుగుల రాజు, అంబులెన్సు శేఖర్, వినయ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!